ఉగ్రవాదుల కాల్పుల్లో వ్యక్తికి గాయాలు

శ్రీనగర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): జమ్ముకాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య గురువారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పౌరునికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. కుద్వని ప్రాంతంలోని భద్రతా సిబ్బంది క్యాంప్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సిబ్బంది కూడా కాల్పులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని సవిూప ఆస్పత్రికి తరలించారని, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు.