ఉచిత కంటి అద్దాల పంపిణీ.

ఈ నెల 12న సాయినాథ పురం వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ లో నంది కంటి శ్రావణ్ కుమార్ ఫౌండేషన్ మరియు సవేరా ఆనంద్ నేత్రాలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఆదివారం కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు నంది
కంటి శ్రీధర్ కంటి అద్దాలు పంపిణీ చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఈవైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడంతో పాటు అవసరమైనవారికి ఫౌండేషన్ ద్వారా కంటి శస్త్రచికిత్సలు చేయిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.