ఉచిత శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన నాయకులు

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు చొరవ తో పోలీసు కానిస్టేబుల్ అర్హత సాధించిన అభ్యర్థులకు హైస్కూలు గ్రౌండ్ మరియు ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో ఉచితంగా శారీరక దృఢత్వ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి సోమవారం మచ్చ వేణు గోపాల్ రెడ్డి ,ఎల్లారెడ్డి , ప్రశాంత్ గౌడ్ తదితరులు నాయకులు సందర్శించారు.శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు మంత్రి హరీష్ రావు తన స్వంత ఖర్చులతో ఎగ్స్, అరటి పండ్లు , పాలు ను పంపిణీ చేసారు.. కష్టపడితే సాధించనిది ఏది లేదని.. మీరు కష్టపడి ఎలాగైతే అర్హత సాదించారో అదే స్ఫూర్తితో శిక్షణ పూర్తి చేసి ఉద్యోగం సాదించాలని సూచించారు.