ఉచిత హామీలపై మార్గదర్శకాలు రూపొందించాలి:సదాశివం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఎన్నికల సమయంలో పార్టీలు ప్రకటించే ఉచిత హామీలు,తాయిలాలు అవినీతి కిందకు రావని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సదాశివన్‌ శుక్రవారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సమయంలో పార్టీలు ప్రకటించే ఉచిత హామీలపై మార్గదర్శకాలు రూపొందించాలని సదిశివం ఈ సందర్భంగా ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ప్రకటితమే తాయిలాలు అవినీతి కిందకు వస్తాయని సవాల్‌ చేస్తూ తమిళనాడుకు చెందిన న్యాయవాది సుబ్రహ్మణ్యం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే సుబ్రహ్మణ్యం వేసిన పిటిషన్‌ను సుప్రీకోర్టు న్యాయవాది సదాశివం ఈ సందర్భంగా కొట్టివేశారు.