ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక

 గరిడేపల్లి, సెప్టెంబర్ 16 (జనం సాక్షి): మండలంలో  ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక పూర్తి అయినదని  మండల విద్యాధికారి పానుగోతు చత్రు నాయక్ అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా గడ్డిపల్లి జెడ్పిహెచ్ఎస్ లో స్కూల్ అసిస్టెంట్ గుత్తికొండ రామ్ రెడ్డి , అప్పన్నపేట  ఎంపీపిఎస్  ఎస్జీటీ బుసా వెంకటేశ్వర్లు, వెల్డండ ఎంపిపీస్ ఎస్జీటీ రామిశెట్టి లక్ష్మయ్య , కీతవారిగుడెం ఏంపిపీస్ ఎస్జీటీ ఎల్లావుల నాగమణి, గానుగుబండ ఎంపిపీస్ ఎస్జీటీ అనంతు రామారావు, రాయినిగుడెం ఎంపీపీస్  ఎస్జీటీ దొంగరి అశోక్ కుమార్, పొనుగొడు ఎంపీపిఎస్ ఎస్జీటీ సందీప్ కుమార్, కల్మల్ చేర్వు జెడ్పిహెచ్ఎస్ ఎల్పిహెచ్ చాప విజయ్ కుమారి, గడ్డిపల్లి ఎంపిపీస్ ఎస్జీటీ  గోదేశి దయాకర్,  మంగాపురం ఎంపిపీస్ ఎస్జీటీ సత్తూరి బిక్షం , రాయినిగూడెం జెడ్పిహెచ్ఎస్  ఎల్పీహెచ్ భద్రం రాజు శైలజ ఎంపికయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి గరిడేపల్లి మండల ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్  సమక్షంలో సెప్టెంబర్ 19 సోమవారం ఉదయం 11 గంటలకు  గరిడేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం యందు ఘనంగా సన్మానించడం జరుగుతుందని మండల విద్యాధికారి అన్నారు. గరిడేపల్లి మండలంలో ఉన్న సమస్త ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు  వివిధ సంఘాల బాధ్యులు తప్పనిసరిగా ఇట్టి కార్యక్రమానికి సకాలంలో హాజరై విజయవంతం చేయగలరని మండల విద్యాధికారి ఛత్రు నాయక్ అన్నారు.

తాజావార్తలు