ఉత్తరకాశీలో చిక్కుకున్నవారి కోసం 12 బృందాలు

ఢిల్లీ : ఉత్తర కాశీలో చిక్కుకున్న వారికోసం 12 సహాయ బృందాలను ఏర్పాటు చేసినట్లు జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి వెల్లడించారు. డెహ్రాడూన్‌ వద్ద ఏడు బృందాలు, హరిద్వార్‌ వద్ద ఐదు బృందాలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తాయని ఆయన తెలిపారు. హరిద్వార్‌లో తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ కేంద్రం ఏర్పాటు చేసినట్లు శశిధర్‌రెడ్డి తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా కొంతమందిని ఇప్పటికే కాపాడినట్లు ఆయన చెప్పారు.