ఉత్తరాఖండ్లోనే మృతుల అంత్యక్రియలు
డెహ్రాడూన్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్లోని చార్ధామ్ తీర్థయాత్రలకు వెళ్లి వరదల్లో మృతిచెందిన వారి మృతదేహాలకు ఉత్తరాఖండ్లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వరదల్లో మృతిచెందిన వారి మృతదేహాలు కుళ్లిపోతున్నందున ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారలు తెలిపారు. దహన సంస్కారం కోసం సుమారు యాబై టన్నుల కలపను సిద్దం చేసినట్లు తెలిపారు. అయితే, మృతులను గుర్తుపట్టేందుకు వీలుగా మృతదేహాల ఫోటోలను వెబ్సైట్లో ఉంచుతామని వెల్లడించారు.