ఉత్తరాఖండ్లో ముమ్మరంగా సహాయక చర్యలు
డెహ్రాడూన్,(జనంసాక్షి): వరద బాధితులకు ఉత్తరాఖండ్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యాత్రికులను ఆర్మీ పిబ్బంది హెలికాప్టర్లతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆచూరీ దొరకని 437 మంది తెలుగు వారిలో 59మంది ఆచూకీ లభ్యమైనట్లు విపత్తు నిర్వహణ కమిషనర్ రాధ తెలిపారు. ఆచూకీ లభ్యమైన వారిలో 47 మంది కర్నూలు యాత్రికులు ఉన్నారని ఆమె చెప్పారు. యాత్రికులను తరలించేందుకు మరి కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. మరోవైపు ఉత్తరాఖండ్లో అంటురోగాలు ప్రబలుతున్నాయి.