ఉత్తరాఖండ్ బాధితులకు కాంగ్రెస్ సాయం
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్లో వరద బాధితులకందించేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున పంపనున్న సహాయ సామాగ్రితో కూడిన వ్యాన్కు ఈ రోజు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రారంభించనున్నారు. ఈ సహాయ సామాగ్రి బాధితులకు అందించేందుకు, అక్కడి సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు ఇప్పటికే సీనియర్ నేతలైన మోతీలాల్ వోరా, అంబికా సోని ఉత్తరాఖండ్లోని కంట్రోల్ రూంకు చేరుకొన్నారు. అక్కడి పరిస్థితిని వారు ఎప్పటికప్పుడు సమీక్షించి వివరిస్తారు.