ఉత్తరాఖండ్ బాధితులకు డీఎస్ పరామర్శ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్లో వరదల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులను ఇక్కడి ఏపీ భవన్లో పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ పరామర్శించారు. వరద బాధితులను ప్రభుత్వం ఇక్కడి ఏపీ భవన్కు చేర్చిన అనంతరం వారిని డీఎస్ కలుపుకున్నారు. సీఎం కిరణ్తో మాట్లాడి తగు సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.