ఉత్తరాఖండ్‌ వరదలపై సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరదలపై సుప్రీంకోర్టు స్పందించింది. వరదలలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను కోర్టుకు తెలపాలని నోటీసులు జారీ చేసింది. సహాయక చర్యలకు సంబంధించి ఈనెల 25 లోపు నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలను ఆవేశించింది.