ఉద్ధప్‌ ఠాక్రేతో మోడీ భేటీ

ముంబయి : ముంబయి పర్యటనలో ఉన్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అనంతరం శివసేన అధ్యక్షుడు ఉద్ధప్‌ ఠాక్రేతో సమావేశమయ్యారు. మోడీ ఠాక్రే నివాసానికి వెళ్లి కలిశారు. మోడీ గుజరాత్‌ దాటి బయటకు రావడం లేదని శివసేన పత్రిక పేర్కొంటున్న ‘నిర్మాణాత్మక విమర్శల’ నేపథ్యంలో ఈ భేటీ చోటుచేసుకుంది.