ఉద్యమకారునికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భరోసా.

ఉద్యమకారునికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భరోసా.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 29, జనం సాక్షి.దౌల్తాబాద్ మండల పరిధిలో తిర్మలాపూర్ గ్రామానికి చెందిన ఉద్యమ నాయకుడు వికలాంగుడు శివంది నర్సింలు కు మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సొంత నిధులతో స్కుటీ పంపిణీ చేశారు. దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీద గా అందజేశారు.
ఈ సందర్భంగా దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వికలాంగులుగా పుట్టడం నేరం కాదు వారికి దేవుడు ఆ విధంగా జన్మనిచ్చారు.
వికలాంగులను మానవత్వం చూడాలి, చిన్నచూపు తో చూడవడ్డు అన్నారు.
వికలంగులు దైర్యంగా ఉండి, ఆత్మవిశ్వాసం తో ముందుకు వెళ్లాలని తెలిపారు.
సీఎం కెసిఆర్ వికలాంగుల కోసం 3016 రూ నుండి పించన్ ను 4016రూ కు పెంచారని తెలిపారు.వికలాంగులను సకలంగులు పెళ్లి చేసుకుంటే లక్ష, కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష మొత్తం రెండు లక్షలు ఇస్తున్నామని,మన ప్రభుత్వం తరపున మీ కోసం సహాయ సహకరలు అందిస్తాం అన్నారు.ఈ కార్యక్రమం లోఎంపీటీసీల పొరం అద్యక్షులు బండారు దేవేందర్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.