ఉమ్మండి వరంగల్ జిల్లా ..
విద్యాసంస్థలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
– ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించి విద్యావలంటీర్లను నియమించుకోవాలి
– పాఠశాలల వారిగా ప్రొఫెల్ను తయారు చేయండి
– ఫ్రొఫెల్లో వసతులపై నివేదిక తయారు చేసి
– పాఠశాలలో ఏఒక్క విద్యార్థి కింద కూర్చోవద్దు
– ఉమ్మడి జిల్లా విద్యాశాఖ సవిూక్షలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
హన్మకొండ, జులై12(జనం సాక్షి) : ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో విద్యాసంస్థలను రాష్టాన్రికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాల విద్యా శాఖపై వరంగల్ రూరల్ కలెక్టర్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి సవిూక్ష ప్రారంభించారు. ప్రతి పాఠశాలలో చదువుకునే వాతావరణం కల్పించాలని అన్నారు. ప్రతి పాఠశాలలో పనిచేసే టాయిలెట్స్ ఉండాలని, నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, కనీస వసతులు, అదనపు తరగతి గదులు, ప్రహరీ గోడలు ఉండాలని, పాఠశాలల కు కలర్స్ వేయాలని డిప్యూటీ సీఎం కడియం సవిూక్షలో తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో వెంటనే ఖాళీలు గుర్తించి విద్యా వలంటీర్లను నియమించుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాల ప్రొఫైల్ తయారు చేయాలి. అందులో పాఠశాల విస్తీర్ణం, విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, ఉన్న సౌకర్యాలు, కావాల్సిన వసతుల పూర్తి సమాచారం స్కూల్ ప్రొఫైల్లో ఉండాలని కడియం తెలిపారు. ప్రతి మండలానికి కలిపి ఒక రిపోర్ట్ ని పాఠశాలల వారీగా ఈ ప్రొఫైల్ రూపొందించాలన్నారు. ప్రాధాన్యతల ప్రకారం ఆయా పాఠశాలాల్లో కావాల్సిన వసతులపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపాలన్నారు. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని విద్యా సంస్థలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కడియం సూచించారు. దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టి విజయవంతం చేసి రాష్ట్రమంతా చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఏ ఒక్క విద్యార్థి కింద కూర్చోవద్దని సూచించారు. పాఠశాలలన్నీ కలర్ ఫుల్ గా ఉండాలన్నారు. పరిశుభ్రంగా ఉండాలని, మనసు పెట్టి పనులు చేయాలని కడియం సూచించారు. పనిచేసే టాయిలెట్స్, నీటి సరఫరా, . డ్యూయల్ డెస్క్ లు, విద్యుత్ సరఫరా, వైట్ వాష్, కలర్స్ వేయడం, అదనపు గదులు, పాత భావనాల మరమ్మత్తు, ప్రహరిగోడలు నిర్మించేలా ప్రాధాన్యత రూపొందించుకొని నిధులు ఖర్చు చేయాలన్నారు. విూరు పెట్టే ప్రతిపాదనలకు నిధుల కొరత రాకుండా చూసుకునే బాధ్యత నాదని శ్రీహరి తెలిపారు. సవిూక్ష సమావేశానికి విద్యా శాఖ సంచాలకులు విజయ్ కుమార్, కలెక్టర్లు ఆమ్రపాలి, హరిత, వినయ్ కృష్ణా రెడ్డి, విద్యా శాఖ చీఫ్ ఇంజినీర్ మల్లేశం, ఆర్జేడీ రాజీవ్, డి.ఈ.ఓ నారాయణ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.
——————————-