ఉషోదయం కాదు… భానుడి ఉగ్రరూపం

ఢిల్లీలో తెల్లవారుతూనే మండుతున్న ఎండలు

న్యూఢిల్లీ : ఢిల్లీ నగరం ఈరోజు ఉదయం నిద్ర లేస్తూనే భానుడి ఉగ్రరూపాన్ని చవిచూసింది. సగటు ఉష్ణోగ్రతకాన్నా ఏకంగా నాలుగు డిగ్రీలు ఎక్కువగా 30.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతతో ఇవాళ తెల్లవారింది. గత ఐదేళ్లలో మే 21,22 తేదీలు ఇంత వేడిగా ఉండడం ఇదే మొదటిసారి. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.