ఎంపీలు పార్టీని వీడటం వల్ల నష్టం లేదు
కేంద్ర మంత్రి బలరాంనాయక్
న్యూఢల్లీి : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్టీని వీడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని కేంద్ర మంత్రి బలరాంనాయక్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డితో బలరాంనాయక్ సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎంపీలు తీసుకున్న నిర్ణయం వారి వ్యక్తిగతమని వ్యాఖ్యానించారు. పార్టీ వీడిన ఎంపీలు తెలంగాణ కోసం వెళ్లారా?, వచ్చే ఎన్నికల్లో గెలవడానికి వెళ్లారా? అని ప్రశ్నించారు.