ఎంపీ అసదుద్దీన్‌కు బెయిల్‌

హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి):
మజ్లిస్‌ ఎంపి అసదుద్దీన్‌కు బెయిల్‌ మంజూరైంది. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తున్నామని, ఫిబ్రవరి 2వ తేదీన తిరిగి హాజరు కావాలని గురువారంనాడు సంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. 10వేల రూపాయల కూడిన ఇద్దరి పూచీకత్తులను కోర్టుకు సమర్పించాలని ఆదేశించిం ది. ఇదిలా ఉండగా 2005లో ఓ ప్రార్దనా  మందిరం వ్యవహారంలో ఎంపి అసదుద్దీన్‌ అప్పటి మెదక్‌ జిల్లా కలెక్టర్‌ సింఘాల్‌ను దూషించారు. దానిపై మెదక్‌ ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో ఎంపి అసదుద్దీన్‌కు గురువారంనాడు బెయిల్‌ మంజూరైంది. వరుసగా రెండుసార్లు ఆయన బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే.