ఎక్స్‌ప్రెస్‌ హైవేతో మారనున్న ముఖచిత్రం

రోడ్డు ప్రాంతాల్లో పర్యాటక అభివృద్దికి కృషి
అమరావతి,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): రాయలసీమ ప్రాంతాన్ని నవ్యాంధ్ర రాజధాని నగరానికి అనుసంధానం చేయడానికి ఉద్దేశించిన అనంతపురం  ఎక్స్‌ప్రెస్‌ మార్గం నిర్మాణంతో సీమ ముఖచిత్రం మారిపోనుంది. అనంతపురం-అమరావతి రహదారి నిర్మాణంతోపాటు రహదారి వెంట భవిష్యత్తులో రైలుమార్గం ఏర్పాటుకు అవసరమైన భూమిని కూడా సేకరిస్తారు.  అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ మార్గం నిర్మాణంలో భాగంగా గుంటూరు జిల్లా పరిధిలో 80.430కిలోవిూటర్ల మేర రహదారి నిర్మిస్తారు. ప్రకాశం జిల్లా నుంచి వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలంలో మార్గం ప్రారంభమై తుళ్లూరు మండలంలో అమరావతి నగరానికి అనుసంధానంతో పూర్తవుతుంది. వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో రహదారి ప్రయాణిస్తుంది. ఈనియోజకవర్గాల పరిధిలో భూసవిూకరణ చేయాల్సి ఉంది. రైతులు
భూసవిూకరణకు ముందుకువస్తే వారికి ప్రాధాన్యత ఇచ్చి సవిూకరిస్తారు. ఈ మార్గంతో రాజధాని నుంచి పల్నాడు ప్రాంతానికి రవాణాసౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ప్రస్తుతం ఉన్న మార్గాలతో పోల్చితే అమరావతి-అనంత ఎక్స్‌ప్రెస్‌ వే దగ్గరిదారి అవుతుందని అంచనా వేస్తున్నారు. రహదారి నిర్మాణంతో రవాణాసౌకర్యాలు మెరుగుపడుతున్నందున పారిశ్రామికంగా అభివృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయనున్నారు. స్థానిక వనరుల లభ్యతను అనుసరించి సంబంధిత వస్తుతయారీ యూనిట్ల ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై జిల్లా కలెక్టర్‌ నివేదిక పంపాల్సి ఉంది. ఇకపోతే ఈ రహదారి నిర్మాణం కోసం సిఎం చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు.  దీనికోసం గుంటూరు జిల్లాలో భూసేకరణకు సంబంధించి కసరత్తు మొదలైంది. రహదారి నిర్మాణంలో భాగంగా మొత్తం 8 మండలాల పరిధిలో 31 గ్రామాల్లో 4వేల ఎకరాలు భూమి సేకరించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ప్రాధాన్య ప్రాజెక్టుగా చేపడుతుండడంతో భూసేకరణకు ప్రత్యేకంగా యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు సేకరించిన పద్ధతిలోనే భూసవిూకరణ కింద భూములు సేకరించాలని నిర్ణయించారు. అయితే రైతులు ముందుకు రాని ప్రాంతాల్లో భూసేకరణ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. రాయలసీమ నుంచి రాజధాని ప్రాంతానికి కీలకమైన మార్గం కావడంతో వీలైనంత తొందరగా పూర్తిచేయాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.  జిల్లా కలెక్టర్లు చొరవ చూపి రహదారి వెళ్లే ప్రాంతాల్లో పారిశ్రామిక హబ్‌లు, వివిధ వస్తువుల తయారీ యూనిట్లు నెలకొల్పడానికి అవకాశమున్న ప్రాంతాలను గుర్తించాలని సూచించింది. దీంతోపాటు పర్యటకంగా అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నారు.రైతుల నుంచి భూసవిూకరణ పద్ధతిలో భూములు తీసుకుని రహదారి వెంబడి అభివృద్ధి చేసిన ప్రాంతాల్లో భూమి కేటాయించనున్నారు. రహదారితోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి యంత్రాంగానికి దిశానిర్దేశర చేశారు. ఎక్స్‌ప్రెస్‌ మార్గాన్ని 120కిలోవిూటర్ల వేగంతో వాహనాలు వెళ్లడానికి వీలుగా నిర్మాణం చేపడతారు.