ఎనిమిది నగరాలను అప్రమత్తం చేసిన హోంశాఖ

ఢిల్లీ: బుద్ధగయ పేలుళ్ల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దేశంలోని 8 ప్రధాన నగరాలను అప్రమత్తం చేసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్‌, చెన్నై, బెంగళూరు ,పుణె, హైదరాబాద్‌ నగరాలను అప్రమత్తం చేసింది. ఢిల్లీలో ఇప్పటికే పలుచోట్ల భద్రతాధికారులు తనిఖీలు చేపట్టారు.