ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య శిబిరానికి అనుమతి నిరాకరణ

ఢిల్లీ : ఏపీభవన్‌లో అశ్రయం పొందుతున్న రాష్ట్రానికి చెందిన ఛార్‌దామ్‌ యాత్రికులకు వైద్యం సాయం అందించేందుకువెళ్లిన ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య బృందానికి అనూహ్యంగా చుక్కెదురైంది. ఏపీభవన్‌లో వైద్య శిబిరం నిర్వహణకు రెసిడెంట్‌ కమిషనర్‌ అనుమతి నిరాకరించారు. ఉత్తరాఖండ్‌ బాధితులకు ప్రభుత్వ వైద్య సాయం అందు తోందంటూ రెసిడెంట్‌ కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు. దీంతో తెలుగుదేశం పార్టీ తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది.