ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పుపెట్టిన దుండగులు
– ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు
గుంటూరు, మార్చి4(జనంసాక్షి) : ఏపీలో ఓ పక్క ఎన్నికల హీట్ పెరుగుతుండగా.. మరోపక్క అదేస్థాయిలో రాజకీయ వైషమ్యాలు పెరిగిపోతున్నాయి.. వైసీపీ, తెదేపా కార్యకర్తలు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో సందట్లో సడేవిూయా అన్నట్లుగా ఆయా పార్టీల నేతలకు చెందిన విగ్రహాలను ధ్వంసం చేసి అల్లర్లు సృష్టించే పనిలో నిమగ్నమైయ్యారు. ఈ కోవలోనే గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహానికి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో గుంటూరు నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థంభాలగరువు, నెహ్రూనగర్, ఏటుకూరు రోడ్డులోగల ఎన్టీఆర్ విగ్రహాలకు కొందరు దుండగులు ఆదివారం అర్థరాత్రి నిప్పుపెట్టారు. ఈ ఘటనలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న తెలుగు తమ్ముళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు.. సోమవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలేం జరిగింది..? ఈ ఘటనలకు పాల్పడిందెవరు..? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే నిందితులెవరో తేలుస్తామని పోలీసులు విూడియాకు వివరించారు. విగ్రహాలకు నిప్పుపెట్టిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని తెదేపా శ్రేణులు డిమాండ్ చేశారు.