ఎన్టీఏతో తెగతెంపులపై నేడు జేడీయూ కీలక సమావేశం

న్యూఢిల్లీ : ఎన్డీఏతో తెగతెంపులపై నేడు జేడియూ కీలక సమావేశం జరగునుంది. జేడీయూ అధ్యక్షుడు శరద్‌యదవ్‌ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు అపార్టీ నేతలు సమావేశమై ఓ నిర్ణయానికి రానున్నారు. మధ్యాహ్నం 3గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని శరద్‌యాదవ్‌ ప్రకటించారు. మరోవైపు జేడీయూ నిర్ణయం కోసం భాజపా నేతలు ఎదురు చూస్తున్నారు. ఎన్టీఏ కూటమి జేడీయూ వైదొలగితే బీహార్‌లో నితీష్‌ మంత్రివర్గం నుంచి తప్పుకునేందుకు వారు సిద్ధమయ్యారు.