ఎన్టీయేతో మా పొత్తు ముగిసింది: శరద్‌యాదవ్‌

పాట్నా,(జనంసాక్షి): ఎన్టీయేతో తమ పొత్తు ముగిసిందని శరద్‌యాదవ్‌ పేర్కొన్నారు. బీహార్‌ భవిష్యత్‌ దృష్ట్యా బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. వాజ్‌పేయి, అద్వానీ లాంటి నేతల మార్గదర్శనం నేడు లేదని శరద్‌యాదవ్‌ తెలిపారు. తాను ఎన్టీయో కన్వీనర్‌ పదవికి రాజీనామా చేశానని శరద్‌యాదవ్‌ తెలిపారు.