ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్థులు

భోపాల్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): బీజేపీ, కాంగ్రెస్‌లు మోసం చేశాయని ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మధ్యప్రదేశ్‌ నీముచ్‌ గ్రామస్థులు ప్రకంటించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో నీముచ్‌ గ్రామానికి చెందిన ఏడు కాలనీల ప్రజలు ఎన్నికల్లో పాల్గొనమని పోస్టర్లు అతికించారు. ఇరవై ఐదు సంవత్సరాలుగా కాలనీలను అభివృద్ధి చేస్తామని ప్రమాణం చేసినా నేతలు మరిచి పోయారని పోస్టర్‌లో పేర్కొన్నారు. మమ్ములను ఓటు అడిగే హక్కును బీజేపీ, కాంగ్రెస్‌ లు కోల్పోయాని తెలిపారు. పొలిటికల్‌ లీడర్స్‌ ప్రచారాన్ని అడ్డుకుంటామని హెచ్చారించారు.