ఎన్నికల ప్రణాళిక కమీటీ ఛైర్మన్‌గా గడ్కరీని నియమించే అవకాశం

పనాజీ: గోవాలో రెండో రోజు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రణాళిక కమిటీ చైర్మన్‌గా మాజీ అధ్యక్షుడు గడ్కరీని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 11మంది సభ్యులతో ఎన్నికల ప్రచార కమిటీని పార్టీ నియమించనుంది. మోడీకి ఎన్నికల ప్రచార కమిటీ సారధ్య బాధ్యతల పై మధ్యాహ్నం అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.