ఎన్‌ కన్వెన్షన్‌పై పలు ఫిర్యాదులు


మంత్రి కోమటిరెడ్డికి కూడా అందిన ఫిర్యాదులు
హైడ్రాకు మంత్రి లేఖ..నిర్దారణతో కూల్చవేతలు
హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనం సాక్షి)  : ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ అక్రమమని మంత్రి కోమటిరెడ్డికి పలు ఫిర్యాదులు
అందాయి. చెరువు శిఖం ఆక్రమించి కట్టారని ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రి వెంకట్‌ రెడ్డి ఈ నెల 21న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు లేఖ రాశారు. కన్వెన్షన్‌ ఆక్రమణల వివరాలతోపాటు ఆధారలు, శాటిలైట్‌ చిత్రాలను అందించారు. మంత్రి లేఖపై విచారణ జరిపిన హైడ్రా అధికారులు ఎన్‌ కన్వెన్షన్‌ను కూల్చివేశారు. అయితే మంత్రి ఫిర్యాదు చేసిన మూడు రోజుల్లోనే నిర్మాణాన్ని కూల్చివేయడం గమనార్హం. కాగా, తుమ్మిడికుండ ఎఫ్‌టీఎల్‌ మొత్తం విస్తీర్ణం 29.6 ఎకరాలు ఉండగా, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో 2014లో 2.39 ఎకరాల్లో అక్రమ కట్టడాలు నిర్మించారు. ఆరేండ్లు గడిచేసరికి అంటే 2020 నాటికి 4.69 ఎకరాల్లో అక్రమ కట్టడాల సంఖ్య 32కు చేరింది. అయితే చెరువు బఫర్‌జోన్‌ మొత్తం 10 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. 2014లో 2.05 ఎకరాల బఫర్‌జోన్‌లో 23 అక్రమ కట్టడాల నిర్మాణం జరుగగా, 2020లో 5.02 ఎకరాల బఫర్‌జోన్‌లో 81 అక్రమకట్టడాలు వెలిశాయి. హైటెక్‌ సిటీ సవిూపంలో ఉన్న తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్‌ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌.. చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్దారించి..కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య.. జంబో జేసీబీలతో కన్వెన్షన్‌ను గంటల వ్యవథిలోనే అధికారులు కూల్చివేశారు. కబ్జా చేసిన 3 ఎకరాల 30 గుంటల్లో 2 ఎకరాలు బఫర్‌ జోన్‌లో ఉంది. మిగిలిన భూమి చెరువు శిఖంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కన్వెన్షన్‌ నిర్మాణం అక్రమమని గత ప్రభుత్వంలోనూ ఫిర్యాదులు అందాయి. అప్పట్లోనే కూల్చివేస్తారని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాలతో అప్పుడు కూల్చివేత జరగలేదు. ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది. సినీ హీరో నాగార్జున ఎన్‌3 రియాల్టీ ఎంటర్‌ప్రైజెస్‌ కింద ఔ`కన్వెన్షన్‌ ఏర్పాటు చేశారు. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టారు. దాదాపు 2,3 వేల మంది కూర్చునేలా మెయిన్‌ హాల్‌, అవుట్‌డోర్‌ సీటింగ్‌ నిర్మించారు. ఇందులో సోషల్‌ ఈవెంట్స్‌, ప్రీవెడ్డింగ్‌, వెడ్డింగ్స్‌ నిర్వహిస్తున్నారు. 2015 ఆగస్ట్‌ 20 నుంచి ఔ`కన్వెన్షన్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్‌ `కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించారనే ఆరోపణలు వచ్చాయి.