ఎర్ర చందనం స్వాధీనం

కడప: కడప జిల్లాలోని పోరుమామిళ్ల, పుల్లం పేట ప్రాంతాల్లో స్మగ్లర్లు దాచిపెట్టిన ఎర్రచందనంను అటవీశాఖాధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 2.26 కోట్లుగా వుంటుందని తెలియవచ్చింది. దీనికి సంబంధించిన ఆరుగురు నిందితులను పోలీసుల అరెస్టు చేశారు.