ఎల్ – 31 కు సాగునీరు విడుదల చేసి జూలపల్లి చెరువును నింపాలి – మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును కలిసిన జూలపల్లి రైతులు

జనం సాక్షి, కమాన్ పూర్ : ఎస్సార్ఎస్పీ ప్రాజెక్టు పరిధిలోని డి-83 కెనాల్ నుంచి 31- ఎల్ ఉప కాలువకు సాగునీరు అందించి తమ పంటలను కాపాడాలని కోరుతూ జూలపల్లి గ్రామ రైతులు కిసాన్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ వైనాల రాజు ఆధ్వర్యంలో ఆదివారం మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబును కాటారంలో కలిశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఎస్సారెస్పీ ఈఎన్సి తో పాటు ఎస్సారెస్పీ ఎస్ ఈ తో ఫోన్ లో మాట్లాడారు. ఎల్ – 31 కెనాల్ కు వెంటనే సాగునీరు విడుదల చేసి ఎస్సారెస్పీ నీటితో జూలపల్లి చెరువును నింపి రైతులు సాగు చేసిన వరి పంటను కాపాడాలని అధికారులకు శ్రీధర్ బాబు ఈ సందర్భంగా సూచించారు. శ్రీధర్ బాబును కలిసిన వారిలో జూలపల్లి ఎంపీటీసీ శవ్వ శంకర్, చొప్పరి తిరుపతి, నీర్ల లింగయ్య , బొజ్జ సతీష్ తో పాటు పలువురు రైతులు ఉన్నారు.