ఎసిబి వలలో అవినీతి అధికారి

కర్నూలు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): మరో అవినీతి అధికారి అనిశా వలకు చిక్కాడు. కర్నూలు వ్యవసాయ శాఖ జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నగొల్లా రాజేష్‌ ఇంట్లో అనిశా అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై కర్నూలు నగరానికి సవిూపంలోని వెంకాయపల్లిలో ఉన్న రాజేష్‌ ఇంటితోపాటు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కర్నూలులో రెండు చోట్ల, నందికొట్కూరు, హైదరాబాద్‌లో అనిశా తనిఖీలు జరిగాయి. సోదాల్లో ఆస్తుల పత్రాలతోపాటు అరకిలో వెండి, అరకిలో బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.  ఇప్పటి వరకు రూ.కోటిన్నరకు మించిన సంబంధించిన ఆస్తులు గుర్తించినట్లు అనిశా డీఎస్పీ జయరామరాజు తెలిపారు.