ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల వాల్ పోస్టర్ విడుదల

 భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభల వాల్ పోస్టర్ ను విడుదల చేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఆనంద్. ఈ సందర్బంగా మాట్లాడుతూ  ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం దేశంలో విద్యా, ఉపాధి, కోసం నిరంతరం పోరాడుతుందని అన్నారు. శాస్త్రీయ విద్య కోసం కులం, మతం, ప్రాంతం, వర్ణ బేధం,లేని సంఘం  ఎస్ఎఫ్ఐ. కావున ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభ తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదిక గా ఈనెల 13 నుండి 16తేది వరకు ఉస్మానియా యూనివర్సిటీ  ఠాగూర్ ఆడిటోరియంలో వైభవంగా జరగనున్నాయి, కావున ఈ యొక్క మహాసభలను ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో, ఫైజాన్ ,స్వాతి మైత్రి, దీపికా,శ్వేతా,మౌనిక, రిజ్వాన్,సూరజ్, తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : శంషాబాద్ ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల వాల్పోస్టర్ విడుదల చేస్తున్న నాయకులు ఆనంద్