ఎస్పీ అమర్జిత్‌ బలిహార్‌కు అశ్రునివాళులు

రాంచి,(జనంసాక్షి): నిన్న జార్ఖండ్‌లో మవోయిస్టుల దాడిలో మృతిచెందిన పాకూర్‌ ఎస్పీ అమర్జిత్‌ బలిహార్‌కి గవర్నర్‌ సయ్యద్‌ అహ్మద్‌తో సహా పలువురు రాష్ట్ర ప్రముఖులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు,సిబ్బంది బుధవారం అశ్రునివాళులు అర్పించారు. జార్ఖండ్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ కార్యలయం ప్రాంగణంలో శోకతప్తులైన అమర్జిత్‌ భార్య, ఇద్దరు కుమార్తెలను గవర్నర్‌ ఓదార్చారు. అనంతరం ఎస్పీ మృతదేహాన్ని పురులియాలోని ఆయన స్వగృహానికి తరలించారు. నిన్న జరిగిన మావోయిస్టుల దాడిలో ఎస్పీతో పాటు మరో ఐదుగురు పోలీసులు మృతిచెందారు.