ఏం చేశారని సంబరాలు : సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ : యూపీఏ-2 నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారని సంబరాలు జరుపుకుంటున్నారని భాజపా నేత సుష్మాస్వరాజ్‌ ప్రశ్నించారు. దేశ ఆర్థిక వాతావరణం ఆందోళనకరంగా ఉందని అన్నారు. ప్రతి నిర్ణయానికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాపైనే ప్రధాని ఆధారపడుతున్నారని విమర్శించారు.