ఏఐసీసీలో మహిళలకు ప్రాతినిధ్యం పెరగాలి: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఏఐసీసీ కార్యవర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం ఇంకా పెరగాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చెప్పారు. ఏఐసీసీ కార్యవర్గ సమావేంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కార్యవర్గ సభ్యులకు రాహుల్‌ దిశానిర్ధేశం చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చే వారికి అడ్డుచెప్పొద్దని నేతలతో రాహుల్‌ అన్నారు. పది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. కష్టపడి పని చేయడం అని నేతలకు సూచించారు. నమ్మకంతో పని చేయండి, కుటుంబంలా ముందుకు పోదాం అని రాహుల్‌ నేతలకు చెప్పారు.