ఏకే ఆంటోనితో గవర్నర్‌ నరసింహన్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్‌ నరసింహన్‌ తీరిక లేకుండా గడుపుతున్నారు. కేంద్ర రక్షణ మంత్రి ఏకే ఆంటోనితో గవర్నర్‌ భేటీ అయ్యారు. సమావేశంలో శాంతి భద్రతలపై చర్చించినట్లు సమాచారం. ఇవాళ ఉదయం కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో గవర్నర్‌ భేటీ అయిన విషయం తెలిసిందే.