ఏటూరు నాగారం నుండే ఎన్నికల సమరశంఖం పూరిదాం

ఏటూరు నాగారం నుండే ఎన్నికల సమరశంఖం పూరిదాం

ఏటూరు నాగారం,
ఆక్టోబర్02(జనంసాక్షి).
మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సీతక్కకి డప్పు చప్పుళ్లతో బాణాసంచలతో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు.
ఐటిడిఎ కార్యాలయం నుండి 1000 బైక్ లతో ర్యాలీగా యువజన కాంగ్రెస్ సమావేశానికి హాజరైన సీతక్క.
ఏటూరు నాగారంలో గాంధీ జయంతి సందర్భంగా, గాంధీ విగ్రహానికి అదే విధంగా బిఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సీతక్క.
బిఆర్ఎస్ నాయకులది ఓట్ల బంధం, నాది కుటుంబ బంధం
నా చివరి రక్తపు బొట్టు వరకు ములుగు నియోజకవర్గ ప్రజల కోసం పోరాటం చేస్తా,
ఎన్నికలు రాగానే బిఆర్ఎస్ నాయకులకు ప్రజలు గుర్తుకు వస్తున్నారు.
ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి వాళ్ళ కడుపులు నింపుకున్నరు.
బిఆర్ఎస్ నాయకులు డబ్బులను నమ్ముకున్నారు నేను ప్రజలను నమ్ముకున్న,
నేను గెలిస్తే ప్రజలు గెలిచినట్లు వాళ్ళు గెలిస్తే డబ్బులు గెలిచినట్లు,
కష్ట సుఖాల్లో పాలుపంచుకునే నేను కావాలా పైసలు ఇచ్చి గేలుదాం అనే వాళ్ళు కావాలా,
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరారు