ఐదోరోజుకు చేరిన సాక్షరాభారత్‌ ఉద్యోగుల నిరసన

విజయనగరంఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ఉద్యోగ భద్రత కల్పించాలంటూ.. గత నాలుగు రోజులుగా సాక్షర భారత్‌ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. రోజుకో విధంగా వినూత్నంగా నిరసన తెలుపుతున్న సాక్షర భారత్‌ ఉద్యోగులు ఈ రోజు ఉదయం విజయనగరం పట్టణంలో ఎఐటియుసి ఆధ్వర్యంలో అర్ధ నగ్న ప్రదర్శన తో నిరసన తెలిపారు. సాక్షర భారత్‌ ఉద్యోగులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తమను ఎలాగైతే అర్థాంతరంగా ఉద్యోగాల నుండి తొలగించిందో.. అదే రీతిలో ఈ అర్ధ నగ్న ప్రదర్శన చేశామని తెలిపారు. తమను ఉద్యోగాల నుండి తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రదర్శన విజయనగరం మయూరి జంక్షన్‌ నుండి కాంప్లెక్స్‌ విూదుగా తిరుమల హస్పటల్‌ వరకూ కొనసాగింది.