ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో మరో ఇద్దరి అరెస్టు
న్యూఢల్లీి : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో మరో ఇద్దరిని ఢల్లీి పోలీసులు అరెస్టు చేశారు. విక్కీ, నితిన్ జైన్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విక్కీ రాజస్థాన్ రాయల్స్ అటగాడు చండీలాను బుకీలకు పరిచయం చేశాడని పోలీసులు వెల్లడిరచారు. తాజా అరెస్టులతో ఈ కేసులో ఇప్పటి వరకూ పోలీసులు అదుపులో తీసుకున్నవారి సంఖ్య 24కి చేరింది.