ఒక తరం నిరుద్యోగలు మోసపోయారు

` గత పాలకులు గొర్రెలు,బర్రెలు మేపుకొమ్మన్నారు
` విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న బీఆర్‌ఎస్‌
` ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు మోసం
` కేసీఆర్‌ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు
` కాంగ్రెస్‌ వచ్చాక 15 నెలల్లో 55 వేల ఉద్యోగాల భర్తీ
` భారాస నేతలను ఎక్కడిక్కడ నిలదీయండి
` చదువుతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు
` ఎస్సీ గురుకుల టాపర్లకు బహుమతులు అందించిన సీఎం రేవంత్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని, ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మండపడ్డారు. తమ ఇంట్లో ఉద్యోగాలు వస్తే చాలనే ధోరణిలో నిరుద్యోగులను మోసం చేసిందని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. గతంలో కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని ఆయన వ్యంగ్యంగా అన్నారు. తెలంగాణ వస్తే.. ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశలపై నీళ్లు చల్లారు. మాజీ సీఎం తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు గానీ, రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. తన ఇంట్లో వాళ్లు ఒక చోట ఓడిపోతే మరోచోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇంకా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య లక్షల్లో ఉంది. బుధవారం హైదరాబాద్‌లోని బాబూ జగజ్జీవన్‌రామ్‌ భవన్‌లో ఎస్సీ గురుకులాల్లో టెన్త్‌, ఇంటర్‌ చదివి.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల విూదగా బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేదంటూ బీఆర్‌ఎస్‌ నేతలను ఆయన నిలదీశారు. పీజీలు చేసిన విద్యార్థులు ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న పిల్లలకు తాము ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే 59 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. గత 15 ఏళ్లుగా గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించలేదన్నారు. తమ హయాంలో 563 గ్రూప్‌-1 పోస్టులు భర్తీ చేస్తున్నామని వివరించారు. గ్రూప్‌-1లో 89శాతం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దక్కాయని సీఎం రేవంత్‌ రెడ్డి సోదాహరణగా వివరించారు. ఈ రోజు అంటే బుధవారం తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి అని గుర్తు చేశారు. వారి స్ఫూర్తిని కొనసాగించేం దుకు తెలుగు యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నామన్నారు. కోటిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామని తెలిపారు. ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారని ఆయన స్పష్టం చేశారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ, డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయాలను కాంగ్రెస్‌ పార్టీ కొనసాగిస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కులం వల్ల ఎవరికీ గుర్తింపు రాలేదు… మంచి చదువుతోనే అందరికీ గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఆత్మనూన్యత భావాన్ని వీడాలంటూ దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలకు సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపు నిచ్చారు. వారిలోని ఆత్మనూన్యత భావాన్ని తొలగించేందుకే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు వంటి స్కీములు తెచ్చారని గుర్తు చేశారు. కానీ విూకు చదువు చెప్పి రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తామని ఎందుకు చెప్పలేదంటూ బీఆర్‌ఎస్‌ నేతలను ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి నిలదీశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిరది వాస్తవం కాదా? అని ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. కానీ మేం మొదటి ఏడాదిలోనే 59 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని స్పష్టం చేశారు. మొదటి ఏడాదిలోనే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. అంతేకాదు గ్రూప్‌ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు సైతం విడుదల చేశామన్నారు. కానీ నోటికాడి కూడును కింద పడేసినట్లు-.. రాజకీయ కుట్రతో నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని గత ప్రభుత్వ పెద్దలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో గ్రూప్‌ 1 పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. అందుకే ఇది సామాజిక సమస్యగా మారుతోందని పేర్కొన్నారు.వాళ్లింట్లో ఎన్నికల్లో ఓడిపోతే ఆరు నెలలు తిరగకుండానే ఇంకో ఉద్యోగం ఇచ్చుకున్నారని బీఆర్‌ఎస్‌ నేతలపై సీఎం రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కానీ విూకుమాత్రం ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. అలాంటి వారు విూకు ఎదురైతే ప్రశ్నించండంటూ యువతకు సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. మొదటి పాతికేళ్ల వయసు వరకు బాగా చదువుకుంటేనే విూరు విూ జీవితంలో రాణిస్తారన్నారు. తప్పుదారి పడితే కన్న తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి ఉంటుందని విద్యార్థులకు ఆయన కీలక సూచన చేశారు. అలాంటి పరిస్థితులు ఎప్పుడూ తెచ్చుకోవద్దంటూ విద్యార్థులకు హితవు పలికారు. కష్టపడండి.. సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌తో రాణించి తల్లిదండ్రులకే కాదు.. రాష్టాన్రికి గర్వకారణంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా దళితుడిని వైస్‌ చాన్స్‌లర్‌గా నియమించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. విద్యా కమిషన్‌ చైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమించామని గుర్తు చేశారు. అలాగే అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను ప్రజా ప్రభుత్వంలో ఎంపిక చేసుకున్నామని వివరించారు. వీరందరికీ కేవలం కులం ప్రాతిపదికన గుర్తింపు రాలేదు.. చదువుకున్నారు కాబట్టే వారికి ఈ గుర్తింపు వచ్చిందని విద్యార్థులకు సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు. దేశ భవిష్యత్‌ తరగతి గదుల్లోనే ఉందన్నారు. అన్ని రంగాల్లో విూరు రాణించాలని మనస్పూర్తిగా తాను కోరుకుంటు-న్నానని తెలిపారు. సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.చాలా మంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదు.. చదువు మాత్రమే. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువుతోనే సాధ్యమవుతుంది. సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉంది. యంగ్‌ ఇండియా నా బ్రాండ్‌.. నా బ్రాండ్‌ అంబాసిడర్లు విూరే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులు ఏర్పాటు చేసిన చిత్రప్రద్శనను సిఎ ఆసక్తిగా తిలకించారు.