ఓరుగల్లు నగరంలో కేటీఆర్ సుడిగాలి పర్యటన-

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన!

900 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..
ఫోటో రైటప్ : అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్..

వరంగల్ ప్రతినిధి: అక్టోబర్ 06(జనం సాక్షి)

 

తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు( కేటీఆర్) శుక్రవారం వరంగల్ ట్రై సిటీలో సుడిగాలి పర్యటన చేపట్టినారు. ఇందులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసినారు. ముందుగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు హెలికాప్టర్లో చేరుకొని అక్కడినుండి రోడ్డు మార్గాన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రిబ్బన్ కటింగ్ చేశారు కేటీఆర్ వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ , చీఫ్విప్ వినయభాస్కర్, పాల్గొన్నారు.డీప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, భాస్కర్,
నగర మేయర్ గుండు సుధారాణి,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, జెడ్పీ డాక్టర్ సుధీర్ కుమార్, ఎమ్మెల్యే లు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, తదితరులు మంత్రి వెంట ఉన్నారు. మొదట జిడబ్ల్యూ ఎంసీ ఆధ్వర్యంలో ప్రగతి నగర్ లోని 48 కోట్లతో నిర్మించిన 15 ఎంఎల్డి ప్రారంభించారు.30 లక్షల వ్యయంతో చేసిన ఎన్ఐటి జంక్షన్ ను, బస్తి దవాఖాన ను ప్రారంభించారు, 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను, కుడా ద్వారా 56 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను, 100 కోట్ల రూపాయల వ్యయంతో టీఎస్ఐఐసి ద్వారా చేపట్టే పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.మడికొండలో ఐఐటీ టెక్నాలజీలో 500 మందికి ఉపాధి కల్పించే కార్యాలయాన్ని ప్రారంభించారు.