ఓల్డ్ బోయిన్ పల్లి హరిజన బస్తీ లో కమ్యూనిటీ హాల్ లో టైలరింగ్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ముద్దం నరసింహ యాదవ్

కార్డు సంస్థ సేవలు మహిళలు అందరూ ఉపయోగించుకోవాలి  కార్పొరేటర్ ముద్దం
కంటోన్మెంట్  డిసెంబర్ 18 జనం సాక్షి   ఓల్డ్ బోయిన్ పల్లి  119 వ డివిజన్  అస్మత్ పేట హరిజన బస్తీ లో కమ్యూనిటీ హాల్ నూతనంగా కొత్త టైలరింగ్ సెంటర్  ప్రారంభోత్సవానికి  ముఖ్యఅతిథులుగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం,  కృష్ణారావు, ఓల్డ్ బోయిన్ పల్లి హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దు నరసింహ యాదవ్ హాజరై  కార్డ్ సంస్థ అధ్వర్యంలో కొత్తగా టైలరింగ్ సెంటర్ ను ఏఎండి  డైరెక్టర్ సాఫ్ట్వేర్ సిస్టం డిజైనింగ్  అనిల్ కుమార్ గోపాలకృష్ణ,  కార్డు సంస్థ ఫౌండర్ & ప్రెసిడెంట్  సుమన్ మల్లాది, కార్డు డైరెక్టర్  మంజులత మల్లాది వారితో  కలిసి ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ కార్డ్ సంస్థ అధ్వర్యంలో ఎన్నో మంచి పనులు పేద మహిళలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారు, వారి చేస్తున్న పనికి ఆ దేవుని తోడు మరియు ఎమ్మెల్యేగా నా సహకారం ఎల్లపుడూ ఉంటుంది అని చెప్పారు. కార్పొరేటర్  నరసింహ యాదవ్ మాట్లాడుతూ   కార్డ్ సంస్థ ఏఎండి చేస్తున్న సేవలను మరింత మంది పేద మహిళలు ఈ సెంటర్ ద్వారా టైలరింగ్ పనులు  నేర్చుకుని  ఉపయోగించుకోవాలనిఅన్నారు.కార్డ్ సంస్థప్రతి నిధులు మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా4 నెలలు శిక్షణ పొందిన వారికి ఎన్ సి విఎస్ టి  సర్టిఫికెట్లను అందజేస్తామని వాటి ద్వారా మహిళలు బ్యాంకు ద్వారా ముద్ర లోన్, మరియు ఇతరులను లోన్లు  ద్వారా ఆర్థికంగా ఎదగడానికి  సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ  నాయకులు
మాజీ కౌన్సిలర్ కర్రె లావణ్య జంగయ్య, మాజీ కౌన్సిలర్ మొక్కల నర్సింగ్ రావు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు  ఎస్సీ సెల్ అధ్యక్షులు బుర్రి యాదగిరి,
డివిజనల్ జనరల్ సెక్రెటరీ మేకల హరినాథ్, సీనియర్ నాయకులు గడ్డం నర్సింగ్ రావు  బాలరాజు,  ఉదయ్,  ఖదీర్ బాయ్,  పిట్ల రాజు, గణేష్, పోచయ్య,  అడ్డు, జె.కె,అశోక్,
పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకురాలులలిత,  సంతోషి, రోజా, పద్మ, సుమ,శశికళ, బస్తీ యువ నాయకులు మరియు కార్డు సంస్థ స్టాప్ అనిల్, ఏసు,అవిష్, లక్ష్మణ్, మీరయ్య, రామకృష్ణ,పెద్దిరాజు పాల్గొన్నారు.