ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
విజయనగరం,ఫిబ్రవరి11(జనంసాక్షి): సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ … కురుపాం బస్టాండ్ వద్ద వైద్య శాఖ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సోమవారం ధర్నా చేపట్టారు. ముందుగా ప్రదర్శన నిర్వహించి, మానవహారం చేపట్టారు. అనంతరం రోడ్డు పై బైఠాయించి నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శాఖ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు శిల్ప మాట్లాడుతూ.. 2011 నుండి ఇప్పటి వరకు తమకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వైద్య శాఖ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. లేకుంటే ఈ నెల 13 నుండి ఉద్యోగులు తమ విధులను బహిష్కరించి మరింత తీవ్రంగా ఉద్యమిస్తారని హెచ్చరించారు.