కంఠీరవ స్టేడియంలో తొక్కిసలాట

కార్యకర్త మృతి

బెంగళూరు : కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం సందర్భంగా కంఠీరవ స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మంజప్ప అనే కాంగ్రెస్‌ కార్యకర్త మృతిచెందాడు. రెండో నంబరు ద్వారం గుండా ఆయన స్టేడియంలోనికి ప్రవేశిస్తుండగానే తొక్కిసలాట చోటుచేసుకోవడంతో మంజప్ప పడిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.