కంపు కొడుతున్న పల్లెలు, పట్టణాలు


కాంగ్రెస్‌ పాలనలో పారిశుద్ధ్యం కొరవడిరది
నిధులు విడుదల లేక నీరసించిన గ్రామాలు
మాజీమంత్రి కెటిఆర్‌ ఘాటు విమర్శలు
హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : కాంగ్రెస్‌ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది.. ప్రజా పాలన అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా..? అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కేటీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడు తున్నాయి. పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకు పోయిన తాజా మాజీ సర్పంచ్‌ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పారిశుధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వాన్నంగా మారడంతో.. ప్లలెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారింది. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయి. పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా.. విూ ప్రజాపాలన అంటే.. ?? అని కేటీఆర్‌ నిలదీశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రతి నెలా పంచాయితీలకు ఠంచన్‌గా రూ.275 కోట్లు విడుదల చేశాం. నేడు.. పెండిరగ్‌ బిల్లులు చెల్లించాలని అడిగిన పాపానికి 1800 మాజీ సర్పంచ్‌లపై నిర్బంధాలు.. అక్రమ
అరెస్టులు. 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన రూ.500 కోట్ల నిధులను గ్రామపంచాయతీలకు ఇంకెప్పుడు ఇస్తారు..? ఉపాధి హావిూ పథకం, హెల్త్‌ మిషన్‌ నుంచి వచ్చిన రూ.2100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారు.. 12,769 పంచాయితీల్లో పేరుకుపోయిన విద్యుత్‌ బకాయిలే రూ.4305 కోట్లని అంచనా. వాటి పరిస్థితి ఏంటని కేటీఆర్‌ ప్రశ్నించారు. దేశానికే పట్టుగొమ్మలుగా భావించే పల్లెలపై కాంగ్రెస్‌ పాలనలో ఎందుకింత నిర్లక్ష్యం.. కాంగ్రెస్‌ పాలనలో.. ప్లలెల్లో పాలన పూర్తిగా పడకేస్తే.. ఇక పట్టణాలు పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రేటర్‌ తోపాటు.. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి. రాష్ట్ర బ్జడెట్‌ లో జీహెచ్‌ఎంసీకి అరకొర నిధులు కేటాయించడంతో.. మహానగరంలో అభివృద్ధి పనులు పూర్తిగా మూలనపడిన మాట వాస్తవం కాదా.. కాంగ్రెస్‌ చెప్పుకునే ప్రజాపాలనలో.. పల్లె ప్రగతికి పాతరేసి.. పట్టణ ప్రగతిని అడ్రస్‌ లేకుండా చేసిన మాట నిజం కాదా.. అని కేటీఆర్‌ అడిగారు. ªపన్సిపాలిటీల్లో పెండిరగ్‌ పనులకు మోక్షం లేదు.. కొత్త పనులకు ప్రణాళిక లేదు. నిధులు లేక పూర్తిగా నీరసించిన మున్సిపాలిటీల్లో కనీసం అత్యవసర మరమ్మత్తులకు కూడా పైసలు లేకపోవడం దుర్మార్గం కాదా..? వర్షాకాలంలో అధ్వాన్నంగా మారిన రోడ్లతో ప్రతినిత్యం అవస్థలు పడుతున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారు..? మున్సిపాలిటీల్లో రూ.1200 కోట్లకుపైగా ఉన్న పెండిరగ్‌ బిల్లులను ఇంకెప్పుడు విడుదల చేస్తారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్‌ శాఖకే ఈస్థాయిలో నిధుల కొరత ఉంటే.. ఇక ఇతర శాఖల దుస్థితి ఏమిటి..? అని
కేటీఆర్‌ మండిపడ్డారు. ఆగష్టు 15 లోపు బకాయిలు చెల్లించకపోతే ఆందోళనకు సిద్ధమవుతున్న మున్సిపల్‌ కాంట్రాక్టర్ల కష్టాలను తీర్చే తీరిక ఈ ప్రభుత్వానికి ఉందా..? కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నుంచి పురపాలక శాఖను ఇప్పటికైనా గ్టటెక్కించే ధైర్యం ఉందా..? మున్సిపాలిటీల్లో దెబ్బతిన్న రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీల మరమ్మత్తులను యుద్ధప్రాతిపదికన చేపట్టే ఆలోచన ఉందా..? బీఆర్‌ఎస్‌ హయాంలో పదేళ్లు పచ్చగా కళకళలాడిన ప్లలెలు, ప్రగతిపథంలో దూసుకుపోయిన పట్టణాలు.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే సంక్షోభంలో కొట్టుమిట్టాడటం విూ అసమర్థతకు, పాలనా వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనం.. విూ చేతకానితనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరిచిపోకండి అని కేటీఆర్‌ పేర్కొన్నారు.
——–