కమాన్ పూర్ మండలంలో పుట్ట మధుకు పాదయాత్ర చేసే అర్హత లేదు..!

కమాన్ పూర్ మండలంలో పుట్ట మధుకు పాదయాత్ర చేసే అర్హత లేదు..!

జనంసాక్షి, కమాన్ పూర్ : తనకు రాజకీయ పునర్జన్మనిచ్చిన కమాన్పూర్ మండలంలో జెడ్పిటిసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు కమాన్పూర్ మండలంలో పాదయాత్ర చేసే అర్హత లేదని కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నమ్మి ఓట్లు వేసిన కమాన్పూర్ ప్రజలని పుట్ట మధు నట్టేట ముంచారని ఆరోపించారు. కమాన్పూర్ మండల ప్రజలు ఇక నిన్ను ఆశీర్వదించడం జరగదని అన్నారు. నీ 24 గంటల పిఏ ఏడ పోయాడు.. కమాన్పూర్ లో సెంట్రల్ లైటింగ్ ఏ కాకులు ఎత్తుకెళ్లాయి.. కమాన్పూర్ లో షాపింగ్ కాంప్లెక్స్ పనులు ఎప్పుడు మొదలు పెడతావు.. తాహసిల్దార్ బిల్డింగ్ ఇంకా అద్దె కొంప నుంచి ఎప్పుడు వెళ్తుంది.. పెంచికల్పేట్ వరకు డబుల్ లైన్ రోడ్డు ఎప్పుడు వేస్తావు..? అని ఆయన ప్రశ్నించారు. నిజాయితీగా వీటిపై స్పందించి తమ కమాన్పూర్ ప్రజల మనసు ప్రేమతో గెలుచుకో కానీ మోసంతో కాదు.. అని అన్నారు.
ఈ విలేఖరుల సమావేశములో కాంగ్రెస్ నాయకులు ఆకుల ఓదెలు, భాద్రపు శంకర్, కుక్క రవి, అఫ్సర్, కొంతo శ్రీనివాస్, ఈరుగురాల షేకర్, భూస తిరుపతి, ముస్తాక్, దాసరి గట్టయ్య, పెండ్యాల రాజు, వేణు, బొజ్జ సతిష్, కుమార్ , పిడుగు విష్ణు, ఛాట్ల రాయమల్లు, చింత పండు మధు,బుర్ర సత్యం గౌడ్, మదునయ్య, అవునూరి లక్ష్మన్ తదితరులు ఉన్నారు.