కరీంనగర్ జిల్లావాసికి ‘జాతీయ యువ అవార్డు’
న్యూఢిల్లీ: రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులకు ప్రతిష్టాత్మక ‘జాతీయ యువ అవార్డులు’ దక్కాయి. రాష్ట్రపతి భవన్లో గురువారం జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన ఎం రాములు, కరీంనగర్కు చెందిన అలువాల విష్ణులకు ప్రణబ్ ముఖర్జీ అవార్డులందించారు.య దేశ వ్యాప్తంగా 28 మందికి ఈ అవార్డుల వచ్చాయి. వ్యక్తిగత అవార్డు గ్రహీతలకు 40 వేలు, సంస్థ తరపున అందుకున్న వారికి 2 లక్షల రూపాయల నగదు, ప్రశంసా పత్రం, పతకం అందజేస్తారు. హైదారాబాద్ బాగ్ అంబర్పేటకు చెందిన ఎం రాములు పారిశుద్ద్యం, కంటిపరీక్షలు, రక్తదాన శిబిరాల నిర్వహణలో చూసిన శ్రద్దకు, కరీంనగర్, రామడుగు మండలం, గోపాల్రావుపేట గ్రామానికి చెందిన అలువాల విష్ణు స్థానిక యూత్క్లబ్ నాయకుడు పర్యావరణం, ఆరోగ్యం, పేదలకు సాయం పాఠశాల విద్యార్థుల చైతన్యానికి కార్యక్రమాలు చేపట్టినందున అవార్డులు అందించారు.