కరీమాబాదులో దసరా ఉత్సవ కమిటీ సర్వసభ్య సమావేశం

కరీమాబాదులో దసరా ఉత్సవ కమిటీ సర్వసభ్య సమావేశం

వరంగల్ ఈస్ట్ అక్టోబర్ 03 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని కరీమాబాద్ ఆదర్శ ట్రస్ట్ భవనంలో మంగళవారం కరీమాబాద్ ఉరుసు దసరా ఉత్సవ కమిటీ సర్వసభ్య సమావేశం అధ్యక్షులు నాగపూర్ సంజయ్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత దసరా ఉత్సవాలు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో విజయవంతం అయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రంగలీల మైదానం స్థలాన్ని భూకబ్జాదారుల నుండి కాపాడడంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ చొరవ తీసుకొని ఇక్కడ నిరంతరం ఉత్సవాలు జరిగేలా కృషి చేశారని వారికి దసరా ఉత్సవ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న, కన్వీనర్ వడ్నాల నరేందర్, గోనె రాంప్రసాద్, శివమూర్తి, వంగరి కోటి, నాగపురి రంజిత్, ఒగిలిశెట్టి అనిల్, పొగాకు సందీప్, సుంకర సంజీవ్, బొమ్మల అంబేద్కర్, రాజు,శ్రీను వెంకటేశ్వర్లు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు