కర్నాటక రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

బెంగళూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): కర్ణాటకలోని హుబ్లీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం హుబ్లీలోని జాతీయ రహదారి నెంబర్‌ 63పై ఒక బస్సు, లారీ ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆరుగురు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. క్షతగాత్రులకు చికిత్స చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలోని రెండు వాహనాలు జాతీయరహదారికి అడ్డంగా పడిఉండటంతో వాటిని తొలిగించారు. దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొనే రాష్టాల్లో కర్ణాటక కూడా ఒకటి. ఇక్కడ 2016లో 44,403 ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. వీటిల్లో 11,133 మంది మృతి చెందారు. ఒక్క బెంగళూరులోనే 5,323 ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 790 మంది ప్రాణాలు కోల్పోయారు.