కలకలం సృష్టించిన మహిళ ఆత్మహత్య

జనగామ,జూలై4(జ‌నం సాక్షి ): జనగామ జిల్లా కేంద్రం వీవర్స్‌ కాలనీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కొండ అలేఖ్య(29) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త ఇంట్లో ఉండగానే మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహిళ ఆత్మహత్య పట్ల స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక హత్య చేశారా అన్న అనుమానలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులు నిజాలు తెలుస్తాయని అన్నారు.