కల్మల్ చెరువులో కారెక్కిన కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు

మండలంలోని కల్మల్ చెరువులో  హుజుర్నగర్  శాసన సభ్యులు  శానంపూడి సైదిరెడ్డి  సమక్షంలో  వైస్ ఎంపీపీ వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు హుజుర్నగర్ క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ  నాయకత్వం కొనసాగిస్తున్న ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ పథకాలు యువతకు శిక్షణ ఉపాధి అవకాశాలను చూసి ఆకర్షణ చెంది టిఆర్ఎస్ పార్టీలో  చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే  శానంపూడి సైదిరెడ్డి  వారందరికి టిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు.
పార్టీలో  చేరిన వారిలో అమరవరపు సుధాకర్,
దాసర మురళి గరిడేపల్లి మండల మాల మహానాడు అధ్యక్షులు కర్ణాకర్ ,జయకర్,భాస్కర్ ఉన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకట్ రమణ రెడ్డి, మండల అధ్యక్షులు కృష్ణా నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్గూరి సత్యనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ కుక్కునూరి  అంజయ్య, మండల రైతు సమితి అధ్యక్షులు పోతురాజు చంద్రయ్య, సోషల్ మీడియా అధ్యక్షులు వట్టే ఎల్లయ్య యాదవ్, గ్రామ ప్రధాన కార్యదర్శి బచ్చలకూరి  శ్రీను, నట్టే నవీన్,గంధ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.