కళ్లద్దాలు అందజేతకళ్లద్దాలు అందజేత

 రామకృష్ణపూర్, (జనంసాక్షి) : గత నెల చివరి వారంలో రామకృష్ణాపూర్ లోని రెండో వార్డులో జరిగిన కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు నిర్వహించి, కొంతమందికి ఆర్డర్ పెట్టిన కళ్లద్దాలు రావడంతో బుధవారం రెండో వార్డులోని తిలక్ నగర్ లో గల అంగన్వాడి సెంటర్ లో లబ్ధిదారులకు వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం పుష్ప, ఆశ కార్యకర్త వెంకటలక్ష్మి, బి ఆర్ ఎస్ వార్డు నాయకులుకృష్ణ,సతీష్, మారుతి, చేరాలు తదితరులు పాల్గొని అందజేశారు, ఈ సందర్భంగా కౌన్సిలర్ సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కెసిఆర్  కంటి వెలుగు కార్యక్రమం  రాష్ట్రమంతట నిర్వహించి, ఎంతోమంది దృష్టి లోపాలు ఉన్నవారికి సరిచేస్తూ, వారికి కళ్లద్దాలు అందజేస్తూ, కంటి చూపు ప్రసాదిస్తున్నారని అన్నారు.  అంగన్వాడి సెంటర్లో సమావేశం అంగన్వాడి సెంటర్ లో వార్డులోని ప్రజలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఇందులో అంగన్వాడి సెంటర్ ద్వారా  ప్రభుత్వం అందజేస్తున్న ఆహారం లబ్ధిదారులు క్రమం తప్పకుండా సెంటర్ కి వచ్చి తీసుకోవాలని కౌన్సిలర్ సుధాకర్ సూచించారు.ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్  జ్యోతి, వార్డు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.